Daily Current Affairs

Latest courses

3-tag:Courses-65px

tiktok ban in india

భారత్‌లో టిక్‌టాక్‌ యాప్ బ్యాన్.. రూ.45 వేల కోట్ల నష్టం








ఈ మొత్తం యాప్స్‌లలో ఎక్కువగా ఎఫెక్ట్‌ పడిన యాప్ ఏదంటే టిక్‌టాక్‌ అనే చెప్పవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు ఇండియాలో టిక్‌టాక్‌ చేయని వారంటూ ఎవరూ ఉండరు. చిన్నవారి నుంచి ముసలి వారి వరకూ టిక్‌టాక్‌ చేస్తూ పలువురు ఫేమస్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు భారత్‌లో టిక్‌టాక్‌ నిషేధం కావడం ద్వారా




 



టిక్‌టాక్ సహా 59 చైనా యాప్‌లను బ్యాన్‌ చేస్తూ కేంద్ర ప్రభుత్వం స్టన్నింగ్ డెసిషన్ తీసుకున్న విషయం తెలిసిందే. దేశ భద్రత, రక్షణ దృష్ట్యా ఈ యాప్‌లను నిషేధిస్తున్నట్లు కేంద్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్‌ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. మరోవైపు గాల్వాన్ లోయలో చైనాతో ఘర్షలో 20 మంది భారత జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. ఈ అంశం తర్వాత చైనాపై మరోసారి వ్యతిరేకత తారాస్థాయికి చేరింది. దీంతో ‘బాయ్‌కాట్ చైనా’ అంటూ సోషల్ మీడియలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం ఈ యాప్‌లను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

కాగా ఈ మొత్తం యాప్స్‌లలో ఎక్కువగా ఎఫెక్ట్‌ పడిన యాప్ ఏదంటే టిక్‌టాక్‌ అనే చెప్పవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు ఇండియాలో టిక్‌టాక్‌ చేయని వారంటూ ఎవరూ ఉండరు. చిన్నవారి నుంచి ముసలి వారి వరకూ టిక్‌టాక్‌ చేస్తూ పలువురు ఫేమస్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు భారత్‌లో టిక్‌టాక్‌ నిషేధం కావడం ద్వారా.. చైనా సంస్థ బైట్‌డ్యాన్స్‌కు రూ.45 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు నిపుణులు. దీనికి సంబంధించి చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ కథనం ప్రకారం భారత్‌లో నిషేధం తర్వాత బైట్‌డాన్స్‌ 6 బిలియన్ డాలర్లు.. మన కరెన్సీలో రూ.45 వేల కోట్లు నష్టపోవచ్చని పేర్కొంది.

No comments:

Post a Comment

Breaking